స్థానికుడిని అందుబాటులో ఉంటా... ఆదరించండి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..
స్థానికుడిని అందుబాటులో ఉంటా... ఆదరించండి..
ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు
◆ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం
◆ సంక్షేమ పాలనను కొనసాగించుకుందాం.
◆ ఓట్ల కోసం టీడీపీ అబద్ధపు నెరవేర్చని హామీలు
ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కల్పించారని ఒకసారి అవకాశం ఇవ్వండని ఎం. వీరాంజనేయులు ప్రజలను కోరారు.
నార్పల మండలం గడ్డంనాగేపల్లి, వెంకటాంపల్లి, మద్దలపల్లి, నాయనపల్లి, నడిమిదొడ్డి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు సైపుల్లా బేగ్ లతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.
అడుగడుగునా గ్రామాల్లో ఆత్మీయంగా హారతులతో ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి అవ్వా తాతలను ఆప్యాయంగా పలకరిస్తూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్న ఐదేళ్ల పాలన చేసిన సంక్షేమాన్ని ఆయా కుటుంబాలకు వివరించారు. స్థానికుడిగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటా.. మంచి చేస్తా.. నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానని, రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లని అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం అపద్దపు హామీలతో వస్తున్నారన్నారు. 2014లో టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ప్రభుత్వ పథకాలు అందాలంటే టిడిపి హయంలో ప్రజలు కార్యాలయం చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాసేవారన్నారు. 2019 లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని జగనన్న నెరవేర్చారన్నారు. ఇంటింటికి సంక్షేమాన్ని అందించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జగనన్న మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని గ్రామాల్లో ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నియోజకవర్గంలో టిడిపి వాళ్లు చేస్తున్న ప్రచారంలో ప్రజలు కరువయ్యారన్నారు. జగనన్నపై విమర్శలు తప్ప ప్రజలకు ఏం చేస్తామో టీడీపీ గట్టిగా చెప్పలేకపోతున్నారన్నారు. రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడును ఓడించి ఇంటికే పరిమితం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 20 2024, 15:16